విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్ నిర్మించారు . చెందు ముద్దు దర్శకుడు. ఈ నెల 6న చిత్రం విడుదలవుతోంది. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి..ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా మారారు. కేవలం మెగా హీరోలను మాత్రమే కాదు. చిన్న, చిన్న హీరోలను సైతం ప్రమోట్ చేస్తూ తన పెద్దరికాన్ని చాటుకుంటున్నారు. ఆయన ఫంక్షన్కు వస్తే సినిమా హిట్ అయిపోతుందనే సెంటిమెంట్ కూడా బలంగా నాటుకుపోయింది. ఇటీవలే చిరంజీవి, నటుడు బ్రహ్మాజీ కుమారుడు విశ్వంత్ హీరోగా నటిస్తోన్న ‘ఓ పిట్ట కథ’ మూవీ ఫ్రి రిలీజ్ ఫంక్షన్కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నటుడు బ్రహ్మజీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవిని ఏమైనా అంటే చంపేస్తాం అంటూ స్టేజ్పైనే ఏడ్చేశారు. ఈ ఆదివారం సాయంత్రం ఈ ఫంక్షన్ జరిగింది. తన కొడుకు సినిమా చేశాడు అనగానే..చాలామంది ఇండస్ట్రీ వాళ్లు సపోర్ట్ చేశారని..దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో దేవుడే ప్రి రిలీజ్ ఈవెంట్కి వచ్చారని బ్రహ్మజీ పేర్కొన్నారు. షూటింగ్స్లో బిజీగా ఉంటున్నప్పటికి అడగ్గానే మెగాస్టార్ ఫంక్షన్కి వచ్చారని..ఆయన హ్యండ్ పడింది కాబట్టి సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయిందన్నారు.
previous post