telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ… ముగ్గురు నిర్మాతలతో…!

Vijay-Devarakonda

సెన్సేషనల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల “డియ‌ర్ కామ్రేడ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. కానీ బాలీవుడ్ లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని భావిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ఒక‌టి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు క‌ర‌ణ్ జోహార్, సిద్ధార్ధ్ రాయ్ క‌పూర్, సాజిద్ న‌డియావాలా ఈ ముగ్గురు క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రధాన పాత్ర‌లో ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేశార‌ట‌. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 6న లాంచ్ కానుందని బాలీవుడ్ టాక్. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన “అర్జున్ రెడ్డి” చిత్రం బాలీవుడ్ లో రీమేక్ కాగా, ఈ చిత్రంతో విజయ్ కు హిందీలోను మంచి క్రేజ్ పెరిగింది. అయితే స్ట్రైట్ సినిమా చేస్తే మంచిదని భావించిన విజ‌య్ ముగ్గురు బ‌డా ప్రొడ్యూస‌ర్స్‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి విజ‌య్ హిందీ డెబ్యూ మూవీకి సంబంధించిన పూర్తి క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. ప్ర‌స్తుతం విజ‌య్ “హీరో” అనే సినిమాతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పూరీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉండబోతోందని ప్రకటించారు.

Related posts