తెలంగాణలో విద్యా వలంటీర్లకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది విద్యా వలంటీర్లకు గత ఏడాది డిసెంబరు నుంచి జీతాలు చెల్లించడంలేదని పేర్కొన్నారు. అంతర్జిల్లాల ఉపాధ్యాయులతోపాటు మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని, 2015 నుంచి నిలిపివేసిన ఉపాధ్యాయుల పదోన్నతులను వెంటనే కల్పించాలని కోరారు.
ఉల్లి కోసం ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి: లోకేశ్