telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వరవరరావుకు కరోనా పాజిటివ్

varavara Rao

విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఓ కుట్ర కేసులో ముంబయి తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమలో అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను ప్రభుత్వం ఆసుపత్రికి తరలించింది. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ముంబయి జేజే ఆసుపత్రిలో ఉండగా కరోనా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆయనను సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించనున్నారు.

ఇటీవల కొంతకాలంగా వరవరరావు వృద్ధాప్య సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బెయిల్ పిటిషన్లు కూడా విఫలమయ్యాయి. ఆయనను విడుదల చేయొద్దంటూ ఎన్ఐఏ గట్టి పట్టుదలతో ఉంది. చివరికి పౌరసమాజం నుంచి కూడా ఒత్తిళ్లు వస్తుండడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

Related posts