telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్

chandrababu vallabaneni

తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సస్పెండ్ చేశారు. వంశీని టీడీపీ నుంచి పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, లోకేశ్ పై నిన్న వంశీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని టీడీపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. వంశీ అంశంపై ఈ రోజు చర్చించిన చంద్రబాబు ఆయనను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.

మరో వైపు వల్లభనేని వంశీ శుక్రవారం విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును కలిశారు. సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన సీపీకి ఫిర్యాదు చేశారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో కోరారు.

Related posts