telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు తీరువల్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్కచూపులు: మంత్రి కొడాలి

kodali nani ycp

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు గుప్పించారు. దేవినేని అవినాశ్ ను గుడివాడలో పోటీ చేయించడం ద్వారా చంద్రబాబు తన అవసరాల కోసం అతన్ని రాజకీయ బలిపశువుగా మార్చారని ధ్వజమెత్తారు.

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అవినాశ్ నానిపై పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా అవినాశ్ వైసీపీలో చేరడంతో నాని స్పందించారు. చంద్రబాబు తీరువల్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారని, త్వరలోనే టీడీపీకి విపక్ష హెూదా కూడా ఉండదని జోస్యం చెప్పారు. బాబు ఇసుక దీక్షపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

Related posts