NRI డాక్టర్ జయశీల్రెడ్డి బుధవారం సాయంత్రం అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అందుకు సిద్ధంగా ఉన్న అతను.. ఫ్యామిలీతో చాలా సరదాగా గడిపాడు. ఆ తర్వాత.. నల్లగొండ మండ లం మేళ్లదుప్పలపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి కనిపించకుండాపోయిన ఉదంతం మిస్టరీగా మారింది.
వ్యవ సాయ క్షేత్రంలోని బావిలో పడ్డారా లేక అదృశ్యమయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం డ్రైవర్ పల్లయ్యను తీసుకుని వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. డ్రైవర్ను గెస్ట్హౌస్లో ఉండమని చెప్పి క్షేత్రం లోపలికి వెళ్లా రు. ఫామ్హౌస్కి వెళ్లిన జయశీల్.. సింగిల్గా సెల్ఫీలు, వీడియోలు తీసుకుని కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంపాడు. ఆ తర్వాత అతను ఇంటికి వెళ్లలేదు. ఫోన్ చెయ్యలేదు. కుటుంబసభ్యులు కాల్ చేస్తే స్విచ్ఛాప్. ఫామ్హౌస్లోనూ లేడు. ఏమైపోయాడన్న టెన్షన్. పంపిన సెల్ఫీలు, వీడియోల తీరు చూస్తే.. అనుమానం వచ్చింది.
ఈ మేరకు పోలీసులకూ ఫిర్యాదు చేయడంతో డాగ్స్క్వాడ్తో పరిశీలించగా శునకం గ్రామాల్లోకి వెళ్లి, తిరిగి వ్యవసాయ క్షేత్రంలో అటూఇటూ తిరిగి వ్యవసాయ బావి వద్ద ఆగింది. జయశీల్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి దగ్గరి బంధువు జయశీల్రెడ్డి.
దీంతో వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి ఉంటారా అన్న కోణంలో బావిలో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడిస్తున్నారు. అమెరికా వెళ్లాల్సిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఇంతకీ అతను ఉన్నాడా.. లేడా? ఎవరైనా చంపేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.