ప్రస్తుతం తెలుగు రాష్ట్రలో ఉప్పేస్తున సినిమా ఉప్పెన. ఇందులో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించారు. అయితే తమ తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుందీ జంట. ఈ సినిమా బుచ్చిబాబు అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి అలరించింది. ఈ సినిమాలోని ప్రతి అంశం కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే.. ఉప్పెన రిలీజ్ కాకుండానే క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమాను వైష్ణవ్ తేజ్ కంపీట్ చేశాడు. రకుల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా వైష్ణవ్ తేజ్ మరో సినిమాను ప్రారంభించేశాడు. “రొమాంటిక్” సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ హీరోయిన్గా ఇందులో నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్పై బాపినీడు సమర్పణలో.. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను గిరీశాయ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా.. ఈ సినిమాలోని ఇతర నటీ నటులను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది.
previous post