సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శృంగార తార మియా మాల్కోవా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “క్లైమాక్స్”. ఈ సినిమాను ఓటీటీ వేదికపై RGVWorldTheatreలో జూన్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు విడుదల చేశారు వర్మ. తాజాగా విడుదలైన క్లైమాక్స్ సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చిందని అంటున్నారు ఆర్జీవీ. థియేటర్స్ని మూయించిన కరోనాని పక్కకి నెట్టి ఆవీ ర్జీవరల్డ్ థియేటర్ని ప్రతి ఒక్కరి ఇంట్లో నిర్మించుకున్నారు. 12 గంటలలో 1,68,596 మంది రూ.100 చెల్లించి ‘క్లైమాక్స్’ను చూశారు. “వెల్కమ్ మియా మాల్కోవా.. బై బై కరోనా. ఆర్జీవీ క్లైమాక్స్ ది గేమ్ ఛేంజర్’’ అని వర్మ తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా పైరసీకి గురి కాగా, కొందరు నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అయినప్పటికి క్లైమాక్స్ చిత్రం ఈ రేంజ్లో రెస్పాన్స్ పొందడం గొప్ప విషయమనే చెప్పవచ్చు. 2,75,000 మార్క్ని కూడా దాటుతుందని అంచనా వేస్తున్నారు వర్మ. సర్వర్ కూడా క్రాష్ అయ్యిందని చెబుతున్న వర్మ ఊహించని ఈ రెస్పాన్స్ని చూసి షాక్ అవుతున్నారు. ‘క్లైమాక్స్’ గేమ్ ఛేంజర్ అంటూ అభివర్ణించారు.
previous post
నిర్మాత పడకగదికి రమ్మన్నాడు…నటి ఆరోపణలు