telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న ఎమ్మెల్సీ కవిత…

తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ 500 మేర కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో కవిత కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరు టీకా తీసుకోవాలని కోరారు. ఇటీవల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా.. ఇప్పటికే తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కరోనా వ్యాక్సినేషన్‌ వేయించుకున్న సంగతి తెలిసిందే.

Related posts