telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

జోష్ లో మార్కెట్లు.. నిఫ్టీ రికార్డు స్థాయికి..

husge loses again in stock markets

ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్నికలలో అనుకూల వాతావరణం కనిపిస్తుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ లో ఉన్నాయి. వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. 2018 డిసెంబర్ తర్వాత ఇన్ని రోజుల పాటు ర్యాలీ కొనసాగడం ఇదే మొదటిసారి. మరోవైపు నిఫ్టీ గత సెప్టెంబర్ 14 తర్వాత తొలిసారి 11,500 మార్కు పైన ముగియడం కూడా ఈరోజే తొలిసారి. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల దూకుడుతో ఈరోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 268 పాయింట్లు ఎగబాకి 38,363కు చేరుకుంది. నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 11,532 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.45%), ఎన్టీపీసీ (2.19%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.18%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.05%), భారతీ ఎయిర్ టెల్ (1.81%).

టాప్ లూజర్స్:
హీరో మోటో కార్ప్ (-2.10%), ఎల్ అండ్ టీ (-1.60%), మారుతి సుజుకీ (-1.13%), బజాజ్ ఆటో (-0.77%), కోల్ ఇండియా (-0.47%).

Related posts