5 రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ ఫలితాలు సాయంత్రానికి వెలువడనున్నాయి.
కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాల్లో తన ప్రభావం చూపించలేకపోయింది. అతి పెద్ద రాష్ట్రం యూపీలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. యూపీలో రాహుల్, ప్రియాంక ప్రచారం ఏమాత్రం ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది.
ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్లో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన ఆధిక్యం కనబరుస్తోంది బీజేపీ. యూపీలో 403 స్థానాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 250 దాటేసింది.
గోవాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. బీజేపీ 16 స్థానాల్లో, కాంగ్రెస్ 19 స్థానాల్లో, ఆప్ 1 స్థానంలో ముందంజ ఉండగా.. ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.