telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అంతర్వేది ఘటనను కావాలనే రాజకీయం చేస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి

vellampalli srinivas ycp

అంతర్వేది ఘటనను కావాలనే రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విన్నవించారు. టీడీపీ హయాంలో 70 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీగోపాలస్వామి రథం దగ్ధమైందని తెలిపారు. దీనికి చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని అన్నారు.

రాష్ట్రాన్ని పీడిస్తున్న రాక్షసుడు చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 దేవాలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుదని వెల్లంపల్లి విమర్శించారు. ఎన్ని గుళ్లకు తిరిగినా చంద్రబాబు చేసిన పాపాలకు పరిహారం దక్కదన్నారు. అంతర్వేది కేసును సీబీఐకి అప్పగించామని చెప్పారు. దేవాలయాల వద్ద భక్తులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related posts