telugu navyamedia
రాజకీయ వార్తలు

చైనా ప్రభుత్వ అజమాయిషీతో 20 కంపెనీలు: అమెరికా

america china

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఎప్పటి నుంచో కొనసాగుతున్నాప్పాటికీ కరోనా నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మరింత అంతరం పెరిగింది. ఈ క్రమంలో అమెరికా ఓ కీలక జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో 20 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ చైనా ప్రభుత్వ అజమాయిషీతో నడుస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది.

వీటిలో కొన్ని చైనా రక్షణ శాఖ, సైన్యం అదుపాజ్ఞల్లో కొనసాగుతున్నాయని వివరించింది. ఏదో ఒక రూపంలో ఈ 20 కంపెనీలకు చైనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్నాయని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ పేర్కొంది

Related posts