telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

భోగీలను వదిలేసి ఇంజన్ తో వెళ్లిపోయిన రైలు

special train between vijayawada to gudur

విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెనుప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో భోగీలను వదిలేసి ఇంజన్ వెళ్లిపోవడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. సుమారు పది కిలోమీటర్ల మేర డ్రైవర్ ఇంజన్ తో వెళ్లిపోయాడు. మధ్యలో నిలిచిపోవడంతో ఎటువైపు నుంచి ట్రైన్ వస్తుందోనని తెలియక ఆందోళనకు గురయ్యారు.

కాసేపటికి భోగీలు వదిలి వెళ్లిపోయిన డ్రైవర్ వెనక్కి వచ్చాడు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇంజన్ రాకపోవడంతో తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందారు ప్రయాణికులు. డ్రైవర్ వచ్చి భోగీలకు ఇంజిన్ అమర్చి యదావిధిగా తీసుకెళ్లాడు. అయితే ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన పై రైల్వే  అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.

Related posts