టాలీవుడ్ లోకి అరంగేట్రం ఇచ్చేందుకు అన్ని విధాల సన్నద్దంగా ఉన్న వైష్ణవ్ తేజ్ తన తొలిసినిమాను కూడా చిత్రించాడు. ఈ సినిమాకు ఉప్పెన అనే పేరు పెట్టారు. ఈ సినిమా నిజానికి గతేడాది ఏప్పిల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఆలస్యం అయింది. ఇది వైష్ణవ్ తొలి సినిమానే అయినప్పటికీ దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నిన్న టీజర్ విడుదల చేసింది. నేడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న చిత్ర యూనిట్ ఆ తరువాత వెకడుగు వేసింది. అందుకు స్టార్ హీరోలతో పోటీ ఎందుకని గానీ, లేకుంటే కరోనా తరువాత థియేటర్లు తెరుచుకొని కేవలం యాభైశాతం ఆక్యుపెన్సీ అనడం కావొచ్చు. ఏది ఏమైనా సినిమా మాత్రం సంక్రాంతి కానుకగా రాలేదు. అయితే సమ్మర్కి విడుదల చేస్తారిన అభిమానులు అనుకున్నారు. అయితే చిత్ర యూనిట్ అభిమానులను అంత సేపు వేచి చూసేలా చేయడం ఇష్టం లేదు. అందుకనే ఈ సినిమాను వచ్చేనెల అంటే ఫిబ్రవరీ5న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తుందట. ఈ మేరకు వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. మరి ప్రేక్షకుల అంచనాలను ఉప్పెన దాటుతుందా అనేదాని కోసం వేచి చూడాల్సిందే.
previous post
next post