బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది సిమ్రాన్ ఖన్నా. తాజాగా సిమ్రాన్ ఖన్నా అధికారికంగా తన భర్త నుండి విడాకులు పొందిన వార్త హిందీ చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. స్టార్ప్లస్ ఛానెల్లో సూపర్హిట్ అయిన ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ సీరియల్లో గాయత్రి గోయెంకా పాత్ర పోషించిన నటి సిమ్రాన్ ఖన్నా భర్త భరత్ నుంచి విడాకులు తీసుకుంది.ఈ విషయాన్ని ఆమె అధికారికంగా వెలువడించింది. తామిద్దరం స్నేహపూర్వకంగానే విడిపోతున్నామని, ఇద్దరి మధ్యా ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పింది. కాగా కుమారుడు వినీత్ ఖన్నా కస్టడీ మాత్రం భర్తకే ఇచ్చినట్లు తెలిపిన సిమ్రాన్ తరుచుగా కొడుకుని మాత్రం కలుస్తానని చెప్పింది.
previous post
లవ్ లో పడితే ఏం చేస్తావు ? అన్నారు… “బిగ్ బాస్”పై మాధవీలత సంచలనం