వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీలోని, రాజకీయాల్లోని, ఫ్యాక్షనిజంలోని ప్రముఖులందిరిపైనా సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు బాధితుల వంతు వచ్చింది. మొదటగా ఆర్జీవిపై సినిమా ప్రకటించిన పాటల రచయిత జొన్నవిత్తుల సినిమా ఇంకా రాకపోయినా.. ఇప్పటికే ‘పరాన్నజీవి’ ఆన్లైన్లో విడుదలైంది. ఇప్పుడు మరో వివాదాస్పద సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ను టాలీవుడ్లోని పీఆర్వోల్లో ఒకరైన ఏలూరు శ్రీను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ సినిమా టైటిల్ ‘రాడ్ గోపాల్ వర్మ’. ఇప్పటి వరకు ఆయన వ్యక్తిత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తూనే మనకు చూపించారు. కానీ, ఇప్పుడు ఎవ్వరికీ తెలియని కథంటూ ఒక ఛాప్టర్ను చూపించబోతున్నారు. ‘శివ’ సినిమాకు ముందు జరిగిన కథట. ఈ విషయాన్ని టైటిల్ పోస్టర్లో స్పష్టం చేశారు. ‘పలు బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్ముతున్న యువకుడిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు’ అనే శీర్షికతో ఉన్న పేపర్ కటింగ్ను పోస్టర్లో పొందుపరిచారు. అంతేకాదు, ఆ పేపర్ కటింగ్లో పోలీస్ ఆఫీసర్ రెండు కాళ్ల మధ్య నుంచి ఆయన్ని నగ్నంగా కూర్చోబెట్టి చూపించారు. ‘‘ఆ రోజు రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో మీకు తెలుసా? ఈ ఫిక్షనల్ రియాలిటీ ఫిలింను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. త్వరలోనే ట్రైలర్ వచ్చేస్తుంది’’ అని ఏలూరు శ్రీను తన ట్వీట్లో పేర్కొన్నారు. కె.ఎస్.మణి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Do you know what happened that night in Punjagutta Police Station?
Stay tuned to experience this Fictional Reality film..
Trailer releasing soon.. pic.twitter.com/gNudHwESqm— Eluru Sreenu (@IamEluruSreenu) August 7, 2020
రజినీకాంత్ ఆరోగ్యంపై కమల్ హాసన్ కామెంట్స్