telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా మృతులకు భూదానం చేసిన తమిళ నటుడు విజయ్‌కాంత్‌

కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి సినిమా స్టార్స్‌ తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. కొంతమంది నగదు రూపంలో విరాళాలు ఇవ్వగా మరికొంతమంది ధాన్యాలు, ఆహారపదార్తాలు ఇస్తున్నారు. అయితే తాజాగా తమిళ సీనియర్‌ నటుడు విజయ్‌కాంత్‌ భూదానం చేశారు. ఇటీవల చెన్నైలో కరోనా సోకిన ఓ న్యూరోసర్జన్‌ను స్మశానంలోకి అనుమతించలేదు ఆ పరిసర వాసులు. అక్కడితో ఆగకుండా ఆ ఆంబులెన్స్‌ మీద దాడి చేశారు కూడా. ఈ విషయం తెలిసి చలించిపోయిన విజయ్‌కాంత్‌.. చెన్నెలో ఉన్న తన స్థలంలో కొంత భాగాన్ని దానం చేశారు. కరోనా వ్యాధితో చనిపోయినవారిని ఖననం చేయడానికి ఆ చోటుని వాడుకోమని కోరారు ఆయన. మృతదేహాల నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదు. ఈ విషయంలో జనంలో అవగాహన తీసుకురావాలి ఈ సందర్భంగా విజయ్‌కాంత్‌ పేర్కొన్నారు. అతడు చేసిన ఈ మంచిపనికి ప్రజలనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Related posts