telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు రాత్రి 10:20 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా తన కేబినెట్ లో సముచిత స్థానం కల్పించడంపై దృష్టిసారించారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ రోజు రాత్రి 10:20 గంటలకు గన్నవరం చేరుకోబోతున్నారు రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు. దాదాపు గంట పాటు చర్చల అనంతరం రాత్రికి 11:20కి నోవోటెల్ కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు అమిత్ షా.

కేబినెట్ కూర్పు.. కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది.

చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు.. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకాబోతున్నారు..

రేపటి ప్రమాణ స్వీకారానికి చాలా మంది VVIPలు ఇవాళే గన్నవరం ఎయిర్పోర్ట్ కి వస్తున్నారు. వారికి ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేస్తున్నారు.

Related posts