telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రాజ్ కోట్ : … నేడు రెండో టీ 20..క్లీన్ స్వీప్ చేస్తానంటున్న బంగ్లాదేశ్..

2nd t20 today on india-bangladesh

నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టి20 జరగనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి టి20లో విజయం సాధించిన బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. సిరీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలి. అయితే మహా తుపాన్ ప్రభావం మ్యాచ్ పై పడే అవకాశాలు ఉన్నాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి మైదానం తడిసి ముద్దైంది.

ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. మొదటి మ్యాచ్ గెలిచిన బంగ్లా టీం క్లీన్ స్వీప్ చేయాలనీ ఉత్సాహంగా ఉన్నారు.

Related posts