telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌.. అజ్ఞాతంలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే?

Jaggareddy gives clarity party change

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయడంతో పాటు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆ పార్టీని దెబ్బతీయాలని టీఆర్ఎస్ వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడడానికి సిద్దం అవుతున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా సిద్దమయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయన అధికార కార్యకలాపాల కోసం ఉపయోగించే సెల్ ఫోన్ తో పాటు పర్సనల్ మొబైల్ కూడా స్విచ్చాప్ చేసివుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు, అందుకోసం టీఆర్ఎస్ అధినాయకత్వంతో మంతనాలు జరుపుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున జగ్గారెడ్డి ఒక్కరే విజయం సాధించారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీపై తన వైఖరిని వెల్లడించారు. పలు సందర్భాల్లో నియోజకవర్గ అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ ను కలుస్తానని ప్రకటించారు. కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 19 కాగా వారిలో 14 మంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరితే విలీనం జరిగే అవకాశం ఉంది.

Related posts