telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

14 శాతం ఉద్యోగులను తొలగించిన ఉబెర్

Uber

లాక్‌డౌన్ నేపథ్యంలో నష్టాలపాలవుతున్న అనేక సంస్థలు ఉద్యోగులను దారుణంగా తొలగిస్తున్నాయి. తాజాగా ట్యాక్సీ రైడింగ్ యాప్ ఉబెర్ కూడా అదే బాటపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ ద్వారా 3700 మంది ఉద్యోగులతో ఆ సంస్థ కస్టమర్ సర్వీస్ హెడ్ రఫిన్ చావెలీ మాట్లాడారు. సంస్థలో ఇదే చివరి రోజుని, అందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్టు చెప్పారు.

కేవలం మూడు నిమిషాలపాటు సాగిన ఈ కాల్‌ ద్వారా తమ ఉద్యోగుల్లో 14 శాతం మందిని తొలగించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ముందస్తు నోటీసు లేకుండా, అందరికీ ఒకేసారి కాల్ చేసి తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, కరోనా మహమ్మారి ప్రభావం ఉబెర్‌పై తీవ్రంగా పడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఉబెర్ 2.9 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది.

Related posts