telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు నర్సింగ్‌ యాదవ్ మృతి…

టాలీవుడ్‌లోనూ తీవ్ర విషాదాన్నే నింపింది 2020.. , ఈ ఏడాది చివరి రోజు కూడా ఓ ప్రముఖ నటుడుని కోల్పోయింది టాలీవుడ్… వెండితెరపై తనకూంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ (52) కన్నుమూశారు.. చాలా కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ఆయన.. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన నర్సింగ్‌ యాదవ్.. 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయ‌న‌కు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. 300ల‌కు పైగా సినిమాల్లో న‌టించి కామెడీ విల‌న్‌గా, విల‌క్షణ న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన బాషాలోనూ మంచి కేర‌క్టర్ చేశారు. విజ‌య‌నిర్మల ద‌ర్శ క‌త్వం వ‌హించిన హేమాహేమీలుతో ఇండ‌స్ట్రీకి ప‌రిచమైన ఆయన..  క్షణ‌క్షణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్లజ‌మీందార్‌, సుడిగాడు, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది.. ఇటీవ‌ల చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబ‌ర్ 150లోనూ న‌టించారు.

Related posts