telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం!

tirumala temple

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయికి చేరుకుంది. ఈ రోజు ఉదయం స్వామి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. వారికి నాలుగు గంటలలోపే దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం టోకెన్లు కలిగివున్నవారికి రెండు గంటల సమయం పడుతోందని అన్నారు.

నిన్న స్వామివారిని సుమారు 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. నేడు స్వామివారి సేవలకు సంబంధించి 50 సుప్రభాతం, 10 అభిషేకం, 80 కల్యాణోత్సవం టికెట్లను లక్కీడిప్ లో జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు.

Related posts