telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఇలా చెక్ పెట్టండి…

చలి కాలం వచ్చేస్తోందంటే మహిళలు అన్నింటికంటే ముందుగా పొడిబారిపోయే చర్మం గురించే భయపడుతుంటారు. గాలిలో తేమ చలికాలంలో బాగా తగ్గిపోతుంది కాబట్టి చర్మం కూడా ఈ సీజన్‌లో పొడిబారిపోతూ ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం కలవారు.. సాదా చర్మం కలవారు చలికాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవలసిందే మరి. స్నానం చేయడం, రాత్రిపూట చలిపులి నుంచి చర్మాన్ని ముఖ్యంగా పెదవులను కాపాడుకోవడం, శిరోజాల నిగనిగలు తగ్గిపోకుండా జాగ్రత్తపడటం, సరైన ఆహారం తీసుకోవడం… ఇలా చలికాలం మహిళల చర్మసౌందర్యానికి అన్నీ సమస్యలే మరి.
చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలోలా నీరు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నీరు తాగుతూ పోవడమే..
చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా, పేషియల్స్ వాడినా తగిన మోతాదులో నీరు తాగకపోతే. శరీరంలో తగిన శాతంలో నీరు లేకపోయిన పక్షంలోనే చర్మం, శిరోజాలు జీవం లేనట్లుగా తయా వ్యాయామం కుదరకపోతే నడక మంచి ఎక్సర్‌సైజ్ అనుభూతిని ఇస్తుంది. చర్మ సౌందర్యానికి, దేహారోగ్యానికి చలికాలంలో మంచినీరు పుచ్చుకోవడం, నడక లేదా వ్యాయామం చాలా ముఖ్యమైనవి. మిగతా అన్ని సౌందర్య లేపనాలు, లేహ్యాలు కూడా దీని ముందు దిగదుడుపే మరి.

వేజలిన్ లేదా పెట్రోలియం జెల్లీ లు వాడాలి . వేజలిన్ బాడీ లోషన్ లేదా ఏ ఇతర బాడీ లోషన్ అయినా రాసుకొని గోరు వెచ్చని నీటి స్నానం చేస్తే శరీరం మృదువు గా ఉంటుంది . టాల్కం పౌడర్లు , ప్యాన్కేక్ పౌడర్లు వాడకూడదు … ఏదైనా బేబీ పౌడర్ లు వాడడం మంచిది . నువ్వుల నూనె చలికాలం లో చక్క గా పనిచాస్తుంది . శరీరానికి నూనె పట్టించి సున్ని పిండి తో వేడి నీరు స్నానం చేస్తే చర్మం సున్నితమవుతుంది .
ఉదయం గోరువెచ్చని నీటితో స్నానము చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్‌ రాసుకొవాలి .
విటమిన్‌ ఇ ఉన్న క్రీములు వాడడం మంచిది .
శీతాకాలము పగుళ్ళకు వేసలైన్‌ వాడాలి .
లైట్ మాయిశ్చరైజర్ కి బదులు థిఖ్ క్రీమ్‌ ను ఉపయోగించాలి ,
స్నానము చేసే నీటిలో కొద్దిగ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి వేడినీల్లస్నానము చేయాలి .ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది .
సాదారణ సబ్బుకు బదులు గ్లిజరిన్‌ సబ్బులు వాడాలి ,
రాత్రి పడుకునే ముందు చేతులకు , కాళ్ళకు వేజలైన్‌ రాసుకోవాలి ,
వారానికు ఒకసారైన హాట్ ఆయిల్ తో మసాజ్ చే్సుకోవాలి ,
పాదాలు పగల కుండా ‘సాక్స్ ‘ వేసుకుంటే మంచిది
పకృతి మంచి పద్దతులు :
నవంబర్ నెల మొదలైనప్పటినుంచి చర్మం పాడవటం మొదలవుతుంది.’వాతావరణం మారింది, జాగ్రత్త పడాలి’ అనే సూచనలు ఇవ్వటం ప్రారంభిస్తుంది మన చర్మం. రాత్రి చలి పెరగటంతో పాటు పగటి ఎండలో తీక్షణత ఏ మాత్రం తగ్గకపోవడంతో బయటకు వెళ్ళేవాళ్ళు రెండిటికీ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అందుకోసం అన్ని రకాల చర్మ తత్వాలకు సరిపోయే కొన్ని ట్రీట్ మెంట్ లు…
* పాలు, తేనె సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తుంటే చర్మం కాంతివంతమవుతుంది. పొడి చర్మానికి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ ప్యాక్ వేస్తుంటే చర్మం కాంతివంతమవుతుంది.
* గుమ్మడికాయ గుజ్జులో కోడిగుడ్డు సొన, పాలు వేసి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి.
* స్నానం చేసే నీటిలో అర కప్పు తేనె కలుపుకుంటే చెర్మం మృదువుగా మారుతుంది.
* పుదీన అకులు, బాదం పప్పులు తీసుకుని తగినంత వేడి నీటిని కలుపుతూ గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి ఆరిన తర్వాత వేడి నీటితొ స్నానం చేయాలి. శీతాకాలం లో వారానికొకసారి ఇలా చేస్తుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.పిల్లలకు ఈ ట్రీట్‌మెంట్‌ బాగాపనిచేస్తుంది.
* పెసర పిండి లేదా శనగ పిండి లో పాలు కలిపి ఆ మిశ్రమంతో ఒళ్ళు రుద్దుకుంటే (సబ్బుకు బదులుగా) చర్మం కాంతివంతమవుతుంది.
* పచ్చి పసుపులో పాల మీగడ కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడగాలి. క్రమం తప్పకుండా రోజూ ఇలా చేస్తుంటే చర్మం తెల్లబడుతుంది.
* ఒక టేబుల్‌ స్పూను శనగపిండిలో అర టీ స్పూను తేనె, ఒక టీ స్పూను పాలమీగడ, రెండు టీ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ వేసి ఆరిన తర్వాత కడగాలి. కొందరికి శారీరక తత్వం అనారోగ్యం వల్ల శరీరం పాడవుతుంది వారు మందులు వాడాలి

Related posts