తెలంగాణలో రోజు రోజుకు మిస్సింగ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ శివారులో అన్నాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూరుకు చెందిన యాడపల్లి సౌమ్య, ఆనంద్కుమార్ దంపతులు. వీరికి కుమార్తె ప్రేమ(11), కుమారుడు శ్రీపాల్ (13) ఉన్నారు. గురువారం రాత్రి భోజనం చేశాక ఎప్పటిలాగే వారు బెడ్రూంలో నిద్రపోయారు. శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తల్లిదండ్రులు నిద్రలేచి చూసే సరికి పిల్లలు బెడ్రూంలో లేరు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు సమీప బంధువుల వద్ద వాకబు చేసినప్పటికీ చిన్నారుల ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు వైరల్ గా మారింది. అన్నాచెల్లెళ్లు ఇద్దరు ఒక్కేసారి ఎక్కడికి వెళ్లారు… లేదా ఎవరిని ఎవరైనా తీసుకెళ్లారు అనే ప్రశ్న పై పోలీసులు ఆ చుట్టూపక్కల ఉన్న సిసి కెమెరాలను పరీక్షిస్తున్నారు.
previous post
ప్రజల తీర్పుకు చంద్రబాబు వక్ర భాష్యాలు: విజయ సాయిరెడ్డి