telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ కు న్యాయం జరగాలంటూ మరోసారి నెటిజన్ల డిమాండ్

Sushanth

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14 ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది.. అయితే ఇది ఆత్మహత్య కేసు అని ముంబై పోలీసులు చెప్పినప్పటికీ, ఇది హత్య అని సుశాంత్ కుటుంబంతో పాటుగా పలువురు అన్నారు. అంతేకాకుండా ముంబై పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని డిమాండ్ చేయడంతో ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి వెల్లడించింది. అనంతరం ఈ కేసులో అనేక మలుపులు తిరిగింది. అయితే ఇప్పటికీ ఈ కేసు ఎటూ తేలకపోవడం గమనార్హం. దీంతో ఇటీవలే మళ్ళీ సుశాంత్ మరణానికి న్యాయం దొరికి తీరాలని నెటిజన్లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు నెటిజన్లు. అలా ఇప్పుడు అతడి మరణంపై ఎంతో కీలకమైన సిబిఐ ఎందుకు ఎలాంటి అప్డేట్ ఇంకా ఇవ్వలేదు అని ప్రశ్నిస్తూ మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. అంతే కాకుండా సెక్షన్ 302 ప్రకారం కేసును తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు సుశాంత్ మరణంపై మిస్టరీగా నిలిచిన ప్రశ్నలకు సమాధానం కావాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts