telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రత్యేక హోదా ఇవ్వండి.. మోదీకి బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ రోజుకో కొత్త ప్రకటన చేస్తూ కాలయాపన చేసింది. మీ పార్టీ స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఏపీకి తీరని అన్యాయం జరిగిందని లేఖలో వివరించారు. 

విభజన తర్వాత రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటుకు గాను కేంద్రం రూ.3,979 కోట్లు మాత్రమే ఇచ్చిందిని, ఇలా అన్ని విధాలుగా ఆంధ్రకు కేంద్రం అన్యాయం చేసింది. ఐదేళ్ల తర్వాత భారత ప్రధాని హోదాలో మరోసారి తిరుపతికి వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రజల ఆశలను, ఆకాంక్షలను గుర్తించాలి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు విభజన హామీలన్నింటిని సంపూర్ణంగా అమలు పరచాలని కోరుతూ ఆ లేఖలో పేర్కొన్నారు.

Related posts