telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాజకీయ శాపం ఉపాధికి దూరం..

రెక్కాడితేగాని డొక్కాడని కార్మికులపాలిట రాజకీయాలు శాపంలా మారాయి. రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఉపాధికి దూరం చేశాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలో పరిసరాల్లో పనిచేస్తున్న వడ్డెర కార్మికులను క్వారీ యాజమాన్యం బహిష్కరించింది.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొంతమంది వడ్డెర కార్మికులు తెలుగుదేశం పార్టీకిఅనుకూలంగా పనిచేశారని క్వారీ యజమానికి కక్షసాధింపు చర్యలు చేపట్టాడు. వడ్డెర సొసైటీ క్వారీలో
వడ్డెర కార్మికులను పనిలోకి రావద్దంటూ బహిష్కరించడంతో 50 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

దీంతో క్వారీ కార్మికులు రాజకీయాలతో తమ పొట్టకొట్టొద్దని క్వారీ యాజమాన్యాన్ని వేడుకున్నారు. క్వారీ ఎదుట నిరసన ప్రదర్శన విషయం తెలుసుకున్న పోలీసులు న్యాయంజరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను కోరారు. వైయస్సార్ సిపి పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మందపాటి రమేష్ రెడ్డి క్వారీ యజమానితో మాట్లాడి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Related posts