telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ట్రస్టు బోర్డుల్లో రిజర్వేషన్లు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పలు శాఖల్లో అనేక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయా శాఖల్లో ఉద్యోగాల భర్తీకీ నూతన నిబంధనలను అమలు చేస్తుంది. తాజాగా ఏపీ లోని దేవాలయాల పాలకమండళ్లకు రిజర్వేషన్లు కలిపిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై పాలకమండళ్లు, దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని సర్కార్ నిర్ణయించింది. అంతేకాదు, పాలకమండళ్లలో మహిళలకు 50 శాతం పదవులను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Related posts