telugu navyamedia
సినిమా వార్తలు

తొలి తెలుగు ఇండియన్‌ విన్న‌ర్‌గా వాగ్దేవి..

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆహాలో ప్రసారమవుతున్న ‘తెలుగు ఇండియన్​ ఐడల్‌ ఫినాలే ఎపిసోడ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది.శుక్రవారం రాత్రి స్ట్రీమింగ్‌ అయిన ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌కు మెగాస్టార్‌ చిరు చీఫ్‌ గెస్ట్‌గా వచ్చారు.

ఈ ఫినాలే ఎపిసోడ్‌లో వాగ్దేవి, వైష్ణ‌వి, ప్ర‌ణ‌తి, జ‌యంత్‌, శ్రీనివాస్‌లు ఫైన‌ల్‌కు రాగా.. వాగ్దేవి విన్నర్‌గా నిలిచింది. చీఫ్ గెస్ట్​గా వచ్చిన చిరంజీవి చేతుల మీదగా వాగ్దేవి ట్రోఫిని అందుకుంది. రూ.10లక్షల ప్రైజ్​మనీ కూడా గెలుచుకుంది. . ఈ సందర్భంగా చిరంజీవి తన తదుప‌రి సినిమా ‘గాడ్‌ఫాద‌ర్‌’లో వైష్ణ‌వికి పాట పాడే అవ‌కాశం ఇచ్చాడు.

అలాగే శ్రీనివాస్‌, వైష్ణవిలు 2, 3 స్థానాల్లో నిలిచి రన్నర్లుగా నిలిచారు. విజేతగా నిలిచిన వాగ్దేవికి చిరంజీవి ట్రోఫీని అందించాడు.మొద‌టి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన శ్రీనివాస్‌కు రూ. 3 ల‌క్ష‌లు ప్రైజ్‌మని, రెండ‌వ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన వైష్ణ‌వికి 2 ల‌క్ష‌ల రూపాయలు బ‌హుమాతిగా అందించారు.

కాగా ఈ సింగింగ్ రియాలిటీ షోకు శ్రీరామ్‌చంద్ర హోస్ట్‌గా.. సంగీత ద‌ర్శ‌కుడు తమ‌న్‌, న‌టి నిత్యామీన‌న్, సింగ‌ర్ కార్తీక్‌లు జ‌డ్జ్‌లుగా వ్యవహరించారు. ఇక ఈ ఫినాలేలో ‘విరాటపర్వం’ టీమ్ రానా, సాయిపల్లవి కూడా సందడి చేశారు.

Related posts