రచయితగా, నటుడిగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పోసాని కృష్ణమురళి. ఇటీవల కాలంలో ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ భార్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పోసాని మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో పరుచూరి బ్రదర్స్ వద్ద శిష్యరికం చేసానని, వాళ్ళతో కలిసి చాలా సినిమాలకు పని చేశానని తెలిపారు. కానీ పోసాని భార్యకు ఎవరెవరో తన గురించి ఏవో కల్పించి చెప్పడంతో ఆమె తనను దూరం పెట్టారని, సరిగ్గా ట్రీట్ చేయకపోవడంతో తనకు విపరీతంగా కోపం వచ్చేదని చెప్పారు పోసాని. ఆ సమయంలో ఆమెను చంపడానికి ఓ కత్తి కూడా కొన్నానని, కానీ ఆ తరువాత తలచుకుని సిగ్గుపడ్డానని, తాను ఎవరో తెలియకపోయినా పరుచూరి బ్రదర్స్ శిష్యుడిగా పెట్టుకొని లైఫ్ ఇచ్చారని, అలాంటిది వారేదో చిన్న మాట అన్నారని బయటకి వచ్చేసి, పరుచూరి భార్యని చంపాలనే ఆలోచన చేయడం తన తప్పు అని ఒప్పుకొని షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
previous post