తెలంగాణలో గత సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈసారి అలాంటి పొరబాట్లు పునరావృతం కావని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు తాము సిద్ధంగా ఉన్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు.
ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల తర్వాత ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఫలితాలపై రేపు సాయంత్రంలోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఈ నెల 15న ఫలితాలు విడుదల చేస్తామని వివరించారు. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని జలీల్ పేర్కొన్నారు.