వ్యవసాయ రంగానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివా్సగౌడ్ గురువారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
నిడ్జింత గ్రామంలో జరిగిన సభలో మంత్రి సబిత మాట్లాడుతూ కేసీఆర్ కృషి వల్లే దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని అన్నారు. ఆరేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివా్సగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వెయ్యి ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.