telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో టపాసులు బ్యాన్…

తెలంగాణ హైకోర్టు దీపావళి పండుగకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ ని బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపధ్యంలో దీపావళి పండుగ సమయంలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. న్యాయవాది ఇంద్ర ప్రకాష్ ధాఖలు చేసిన పిల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతారని పేర్కొన్నారు. క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు శ్వాస కోశ ఇబ్బందులు పడుతారని పేర్కొనగా పిటీషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హై కోర్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలన్న హై కోర్టు ఎవ్వరూ క్రాకర్స్ అమ్మడం గాని , కొనడం గాని చేయొద్దని కోరింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలన్న  హైకోర్టు ఈ నెల 19న ఈ ఆదేశాలకి సంబంధించి ఎలాంటి చర్యలు  తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రచార మాధ్యమాల ద్వారా  క్రాకర్స్  కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు పేర్కొంది. ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు బ్యాన్ చేసిందన్న హైకోర్టు, కలకత్తా లో కూడా బ్యాన్ చేయకపోతే సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచిందని గుర్తు చేసింది. అందుకే తెలంగాణ లో కూడా క్రాకర్స్ బ్యాన్ చేయాలని హై కోర్టు నిర్ణయం తీసుకుంది. 

Related posts