హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిని పట్టించుకోకుండా… దాడులను నిరసించిన వారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ఒక హక్కు అని చెప్పారు.
రథాలపై దాడులకు తెగబడుతున్న వారిని అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందనన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన నేపథ్యంలో అక్కడకు వెళ్లిన హిందూ సాధువులు, భక్తులు, నేతలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఛలో అమలాపురం కార్యక్రమానికి తమ మిత్రపక్షమైన బీజేపీ పిలుపునిచ్చిందని మనోహర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని జనసేన శ్రేణులను నిన్న రాత్రి నుంచి గృహనిర్బంధంలో ఉంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడే రాముడు గుర్తొస్తాడు: ఎంపీ కవిత