telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బోటు ప్రమాదం పై కేసీఆర్ దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా!

kcr special pooja in kaleswaram

ఆంధ్రప్రదేశ్ లోని పాపికొండల టూర్ లో 61 మందితో వెళ్తుండగా టూరిజం బోటు గొదావరిలో నీటమునిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనలో పలువురు తెలంగాణ వాసులు కూడా గల్లంతయ్యారు. దీనిపై స్పందించిన కేసీఆర్ బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మంత్రి పువ్వాడ అజయ్ ను సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పువ్వాడ వెంటనే రాజమండ్రికి బయల్దేరారు. గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనలో హైదరాబాద్, వరంగల్ కు చెందిన వారు కూడా ఉండడంతో ప్రత్యేకంగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచారు.

Related posts