అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ (జేఏసీ) నేతలు, రైతులు ఈరోజు ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలుసుకున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసమని మేము వేలాది ఎకరా భూములు ఇచ్చామని తెలిపారు.
ఇప్పుడు రాజధాని మార్పు అంటున్నారు. తమ ఆందోళన వ్యక్తం చేస్తే తప్పుడు కేసు బనాయించారు. దాడులు చేస్తున్నారని తమ గోడు వినిపించుకున్నారు. రాజధాని తరలిపోకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. రాష్ట్రపతి, ఇతర బీజేపీ పెద్దలు, సోనియా, రాహుల్ అపాయింట్ మెంట్ లు కూడా కోరామని, వారిని కూడా కలిసి సమస్య వివరిస్తామని తెలిపారు.
భావితరాల సంక్షేమం కోసం జగన్ కృషి: మంత్రి బొత్స