వైసీపీ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవిపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి పదవికి అనర్హురాలని మండిపడ్డారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పోటా పోటీగా పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నారని విమర్శలు సంధించారు. ఏపీని జుదాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి ఆడియో క్లిప్పింగ్స్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాగా.. తన మాజీ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఇవాళ ఉదయం ఫిర్యాదు చేశారు. తాడికొండ పీఎస్లో నలుగురిపై ఫిర్యాదు చేసారు ఎమ్మెల్యే శ్రీదేవి. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపణలు చేసారు. ఈ మేరకు సందీప్, సురేష్ మరో ఇద్దరి నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సందీప్, సురేష్ ఇటీవలే వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారని…పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్న కక్షతో తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపణలు చేశారు.
previous post