telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మద్యం తరలిస్తూ పట్టుబడ్డ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

liquor shops ap

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణలో పూర్తి స్థాయిలో మద్యం షాపులను మూసివేశారు. ఈ క్రమంలో హైద్రాబాద్  ప్రాంతంలోని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. మలక్‌పేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హోంగార్డు అనిల్‌కుమార్‌, నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ అక్రమంగా మద్యం తరలిస్తూ వనస్థలిపురం పనామా వద్ద పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు.

నిందితుల వద్ద నుంచి బ్లెండర్స్‌ప్రైడ్‌ 11 ఫుల్‌ బాటిల్స్‌, 9 సిగ్నిచర్‌ పుల్‌బాటిల్‌, రాయల్‌ చాలెంజ్‌ ఫుల్‌బాటిల్స్‌ 16, మొత్తం 36 బాటిల్స్‌ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.14000 నగదు, ఎర్టీగా కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

Related posts