telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధానిపై స్పష్టత లేకుండా బొత్స మళ్లీ ఏదేదో మాట్లాడారు: టీడీపీ నేత సోమిరెడ్డి

somireddy brother into ycp today

ఏపీ రాజధాని అమరావతి పై సీఎం జగన్ నిన్న సీఆర్డీఏ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షపై అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత సోమిరెడ్డి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. సమీక్ష అనంతరం జగన్ మళ్లీ మంత్రి బొత్సతోనే మాట్లాడించారని సోమిరెడ్డి దుయ్యబట్టారు . బొత్స మాటలు అనువాదం చేయించుకున్నా అర్థంకాని పరిస్థితి అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాజధానిపై స్పష్టత లేకుండా బొత్స మళ్లీ ఏదేదో మాట్లాడారని విమర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ కు చెందిన కంపెనీ భూముల గురించి ఆయన ప్రస్తావించారు. భరత్ కు చెందిన భూములు ఇప్పుడు ఎవరి పరిధిలో ఉన్నాయి? ఆ భూమి ప్రభుత్వం దగ్గర ఉందా? లేక భరత్ చేతుల్లో ఉందా? అని ప్రశ్నించారు. బొత్స మంత్రిగా ఉన్నప్పుడే ఆ భూముల ఎంవోయూ జరిగిందని సోమిరెడ్డి అన్నారు.

Related posts