telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సనాతన ధర్మానికి నెలవు భారతదేశం: ఎంపీ గల్లా జయదేవ్

galla jayadev got new responsibilities

సనాతన ధర్మానికి నెలవు భారతదేశమని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అభివర్ణించారు. ఇలాంటి దేశంలో మహిళలు, ఆడపిల్లలపై వేధింపులు, అత్యాచారాలు జరగడం విచారకరమని ఆయన అన్నారు. ఇది ఎందుకు జరుగుతుందో సమాజంగా మనం అర్థం చేసుకోవాలని ట్వీట్లు చేశారు.నేరస్థులను శిక్షించడానికి ప్రభుత్వం చట్టాలను తీసుకువచ్చి అమలు చేస్తున్నప్పటికీ, ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని గల్లా జయదేవ్ సూచించారు.

తమను తాము ఎలా రక్షించుకోవాలో అమ్మాయిలకు నేర్పినప్పుడు, చిన్న వయస్సు నుండే మహిళలను గౌరవించాలని అబ్బాయిలకు కూడా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.స్త్రీ పురుష సమానతలు, ఒకరు లేకుండా మరొకరు లేరన్న విషయం తెలియజేయాలని గల్లా జయదేవ్ అన్నారు.అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎదుర్కొనేలా మహిళలకు అండగా నిలవాల్సిన కనీస బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చెప్పారు.

Related posts