నటిగానే కాకుండా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ గురించి అందరికి తెలుసు. భద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మరాఠీ.. ఆనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పవన్ తో తప్పా మరో హీరోతో సినిమా చేయలేదు. జానీ సినిమా తరువాత పవన్ ను వివాహం చేసుకున్నది. కొంతకాలం తరువాత మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారు. పవన్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అటు రేణు కూడా మరో వివాహం చేసుకోవడానికి సిద్ధం అయ్యింది. ఇప్పుడు పవన్తో విడిపోయి ప్రస్తుతం రేణూ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పుణెలో ఉంటున్న సంగతి తెలిసిందే. రోజూ తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను రేణు ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూనే ఉంటారు. అయితే ఇటీవల రేణు పోస్ట్ చేసిన ఫొటోకు ఓ నెటిజన్ ఇచ్చిన కామెంట్ రేణూకు నచ్చలేదు. అకీరా తన చెల్లి ఆద్యను ఎత్తుకున్న ఫొటోను రేణు ఇటీవల ఇన్స్టాగ్రామ్ల పోస్ట్ చేశారు. దీనికి క్యాప్షన్గా.. ‘1 2 3 అని లెక్కపెట్టేలోపు నేను నీ ముందు ఉంటా. ఆద్య, అకీరా క్రేజీ ఫెల్లోస్.. కానీ వారిద్దరూ నా సొంతం’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోకి ఓ నెటిజన్.. ‘ఎంతైనా పవన్ రక్తం కదా..’ అని కామెంట్ చేశాడు. ఆ నెటిజన్ చేసిన కామెంట్కు రేణు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘టెక్నికల్గా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్ తెలిస్తే ఈ మాటకు అర్థం తెలుస్తుంది’ అని సమాధానం ఇచ్చారు.
previous post