telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

గ్రేటర్‌ ఎన్నికలపై అడవి శేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు…!

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడి చేస్తుంటాడు అడవి శేష . ఈ తరహా సినిమాలకు అడవిశేష్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. క్షణం, గూఢాచారి వంటి సినిమాల్ని తీసి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఓ వైపు నటిస్తూ… మరో వైపు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్క్రీప్ట్ విషయంలో కూడా తన సత్తా చాటుతున్నాడు అడవి శేష్. అయితే తాజగా అడవి శేష్ మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి రెడీ అవుతున్నాడు. గూఢాచారి 2ను త్వరలో తీసేందుకు అడవి శేష్ సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా కథను కూడా అతడే రెడీ చేసినట్లు సమాచారం. తన స్నేహితుల సలహాలు సూచనలతో స్క్రిప్ట్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. కథ కూడా బాగా కుదిరినట్లు టాక్. అడవి శేష్ నెక్ట్స్ ఫిల్మ్ కూడా గూఢాచారి 2 యేనని సమాచారం. అయితే.. తాజాగా అడవి శేషు గ్రేటర్‌ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్‌లో ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది. మణికొండలాంటి ప్రాంతాల్లో మాటిమాటీకి బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్‌ వాటర్‌ని ఎక్కువగా తోడేస్తున్నాం. హైదరాబాద్‌ వాతావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓటు హక్కు అన్నది బ్రహ్మాస్త్రం. ఓటు ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా.. దొరక్కపోయినా లీడర్లకు మనం ఇచ్చే విలువ ఏంటి అంటే ఓటు వేయడం” అని అడవి శేష్‌ పేర్కొన్నారు.

Related posts