telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్‌కు నూతన ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ వైస్ చైర్మన్ ఎండీగా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారి ప్రతాప్ ను ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం ఇటీవలే ఆర్టీసీనీ ప్రభుత్వ రంగంలో విలీనం చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం ఇటీవలే ఆర్టీసీనీ ప్రభుత్వ రంగంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. జనవరి ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ఎండీ స్థానంలో ప్రతాప్ ను ప్రభుత్వం నియమించింది. ఈయన స్థానంలో ప్రస్తుతం పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రజత్ భార్గవ్ ను ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా నియమించింది.

Related posts