‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అని మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు .వైకాపా అరాచకాలపై ఇన్నాళ్లూ ఓపికతో ఉన్నామని.. ఇకపై సహించబోమని సునీత అన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన దీక్షా స్థలి వద్ద సునీత మాట్లడుతూ వైకాపా నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో తాము పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే.. వైకాపా గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నా.. అధికారంలో వచ్చాక శాంతంగా ఉండమని చెప్పారని కాబట్టే ఉన్నామని… ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని అన్నారు.
పరిటాల రవిని చంపిన వాళ్లు రోడ్ల మీద తిరుగుతోన్నా చంద్రబాబు మీద గౌరవంతో గొడవలు పెట్టుకోలేదని, చంద్రబాబు ఇకనైనా మారాలని, ఆయన గంట కళ్లు మూసుకుంటే కథ వేరేలా ఉంటుందని, మా రక్తం ఉడుకుతోందని.. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఓ గంట పాటు కళ్లు మూసుకుంటే చాలు. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు కాళ్ల కింద ఉండే వ్యక్తులు వంశీ, నాని వంటి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు ఊ.. అంటే మంత్రులను తిరగనివ్వం. తిట్లు మాకూ వచ్చు.. మేమూ మాట్లాడగలం. మాకూ బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం’’ అంటూ తీవ్రస్థాయిలో సునీత విరుచుకుపడ్డారు.
టీఆర్ఎస్ గతే వైసీపీకి పడుతుంది…