telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన: మంత్రి సురేష్

suresh adimulapu minister

ఏపీలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా ముందుకు వెళతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని విద్యాశాఖ కార్యాలయంలో మంత్రి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా డీఈవోలు, ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని సూచించారు.

పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం రుచికరంగా, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2024 నాటికి ఏపీలో సమగ్ర విద్యావిధానం తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనిని గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచుతామని సురేష్ తెలిపారు. విద్యాశాఖలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Related posts