telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రేపు బెంగుళూరులో సంపూర్ణ లాక్‌డౌన్‌!

lockdown hyd

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ పాటించ‌నున్నారు. వ్యాపార సముదాయాలను మూసివేయ‌నున్నారు. ఈ మేరకు బెంగుళూరు మ‌హాన‌గ‌ర పాలిక క‌మిష‌న‌ర్ బీహెచ్ అనిల్ కుమార్ ఓ వీడియో సందేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. లాక్‌డౌన్ 1.0లో ఉన్న నిబంధనలే ఆదివారం కూడా వ‌ర్తిస్తాయ‌న్నారు.

ప్రజలంతా ఇండ్ల‌లోనే ఉండాలంటూ ఆయ‌న ఆదేశించారు. సీఎం య‌డ్యూర‌ప్ప ఆదేశాల మేర‌కు లాక్‌డౌన్ విధించిన‌ట్లు చెప్పారు. కేవ‌లం మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఉంటే త‌ప్ప ఎటువంటి వాహ‌నాల‌కు అనుమ‌తి ఉండ‌దు. పోలీసు క‌మిష‌న‌ర్ భాస్క‌ర్ రావుతో ఈ విష‌యం చ‌ర్చించిన‌ట్లు అనిల్ కుమార్ తెలిపారు.

Related posts