telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సి నా రె గురించి అందరికీ తెలుసు: సీఎం జగన్

jagan

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ సి. నారాయణరెడ్డి గురించి అందరికీ తెలుసునని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన గురించి తాను పెద్దగా చెప్పనవసరంలేదని అన్నారు. సి. నారాయణరెడ్డిపై రాసిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నారాయణరెడ్డిపై రాసిన పుస్తకం తన చేతుల మీద ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన ఆయన గురించి, ఆయన రాసిన కవితలు, మాటలు గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు  ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. 

Related posts